రెండు పిల్లలతో తిరుగుతున్న ఎలుగుబంటి
ABN , First Publish Date - 2022-06-14T14:32:13+05:30 IST
రెండు పిల్లలను శరీరంపై ఎత్తుకొని తల్లి ఎలుగుబంటి రోడ్డు దాటి వెళ్లే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలోని క్యాథరిన్
ప్యారీస్(చెన్నై), జూన్ 13: రెండు పిల్లలను శరీరంపై ఎత్తుకొని తల్లి ఎలుగుబంటి రోడ్డు దాటి వెళ్లే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నీలగిరి జిల్లా కోతగిరి సమీపంలోని క్యాథరిన్ జలపాతం వద్దకు వెళ్లే మార్గంలో ఎలుగుబంటి రెండు పిల్లలను ఎత్తుకొని వెళ్లే దృశ్యాలు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా, ఇలాంటి చర్యలతో వన్యమృగాలు బెదిరి దాడిచేసే అవకాశముందని, ఇలాంటి చర్యలకు వాహనదారులు, పర్యాటకులు పాల్పడొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.