సైబర్ నేరస్థులతో అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-08-12T05:41:23+05:30 IST
సైబర్ నేరస్థులతో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రూపేష్ సూచించారు.
- అవగాహన సదస్సులో డీసీపీ రూపేష్
పెద్దపల్లి టౌన్, ఆగస్టు 11 : సైబర్ నేరస్థులతో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ రూపేష్ సూచించారు. స్థానిక ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో గురువారం సైబర్ నేరా లపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సెల్ఫోన్లు, ఇంటర్నె ట్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందన్నారు. మహిళలు, పిల్లలే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడుతూ వివిధ రకాల వేధింపుల కు గురిచేస్తున్నారని వివరించారు. ఆన్లైన్లో ఎన్నో రకాల యాప్ల ద్వారా వివిధ షాపింగ్లు, ఉద్యోగాలు, లావాదేవీలు తదితర అవసరాల నిమిత్తం విరివిగా ఆన్ లైన్ సేవలను వినయోగించడం పెరిగిందన్నారు. దీన్ని ఆసరా చేసుకొని సైబర్ నేర స్థులు లోన్లు ఇస్తామని, తక్కువ ధరకు వస్తువులు, వాహనాలు ఇస్తామని చెప్పి డేటా సేకరించి బ్యాంకుల్లో ఉన్న నగదును కాజేసి తిరిగి వేధింపులకు గురిచేస్తున్నా రని పేర్కొన్నారు. ఈ నేరాల బారిన పడకుండా పోలీస్ శాఖ సైబర్ కాంగ్రెస్, ఉమె న్ సేఫ్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. విద్యా వ్యవస్థల్లో ఆన్లైన్ భద్రత కల్పించడంతో పాటు సైబర్ నేరాలను నియంత్రించేందుకు అవగాహన కల్పిస్తున్న ట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలు నియంత్రించడంలో ఉపాధ్యాయులు తమవంతు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సాదుల సారంగ పాణి, డీఈవో మాధవి, సీఐలు ప్రదీప్కుమార్, సతీష్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.