అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2021-04-16T05:06:20+05:30 IST

అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని కాశీబుగ్గ అగ్నిమాపకశాఖ అధికారి ఎంఎస్‌వీ రవి ప్రసాద్‌ తెలిపారు.

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండండి
ఇచ్ఛాపురంలో వంట గ్యాస్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక సిబ్బంది :

పలాస:అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని కాశీబుగ్గ అగ్నిమాపకశాఖ అధికారి ఎంఎస్‌వీ రవి ప్రసాద్‌ తెలిపారు. గురువారం పలాస ఆర్టీసీ కాంప్లెక్స్‌, కాశీ బుగ్గ బస్టాండు, రైల్వేస్టేషన్‌లో  అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ప్రమాదాలు జరిగితే తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరించారు.కార్యక్రమంలో సిబ్బంది బి.రామారావు, ఎస్‌.నీలా చలం, పి.మన్మథరావు పాల్గొన్నారు.ఫ నరసన్నపేటలో ప్ర మాదాల సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై విన్యాసాలు ప్రదర్శించి అవగాహనకల్పించారు. కార్యక్రమంలో  అగ్ని మా పకశాఖ అధికారి కేపీ నాయుడు, సిబ్బంది జి.రమ ణమూ ర్తి, కె.సుందరరావు పాల్గొన్నారు. ఫ ఇచ్ఛాఫురం: వంట గ్యాస్‌ వినియోగించే  సమయంలో అప్రమత్తంగా ఉండాలని అగ్ని మాపక దళ అధికారి వి.భాస్కరరావు తెలిపారు. గురువారం  ఇచ్ఛాపురంలో గ్యాస్‌ వినియోగించే సమయంలో తీసుకోవ ల్సిన జాగ్రత్తలను అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు.కార్యక్రమంలో పీఆర్‌రెడ్డి, కామ రాజు, భాస్కరరావు పాల్గొన్నారు. ఫ సోంపేట: సోంపేటలో అగ్నిప్రమాదల నివారణపై తీసుకోవల్సిన జాగ్రత్తలను వివరిస్తూ   కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అగ్నిమాక అధికారి ఎస్‌.వరహాలు, సిబ్బంది పాల్గొన్నారు. 

 

 


Updated Date - 2021-04-16T05:06:20+05:30 IST