ఢిల్లీ బృందంలో బీసీ జనార్దనరెడ్డి

ABN , First Publish Date - 2021-10-26T04:34:02+05:30 IST

ఏపీలోని మంగళగిరి, విశాఖపట్నం తదితర చోట్ల టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ అధికారప్రతినిధి ఇంటిపై వైసీపీ నాయకుల దాడులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి వెళ్లారు.

ఢిల్లీ బృందంలో బీసీ జనార్దనరెడ్డి
రాష్ట్రపతిని కలిసేందుకు వెళ్తున్న మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి, తదితరులు


బనగానపల్ల్లె, అక్టోబరు 25: ఏపీలోని మంగళగిరి, విశాఖపట్నం తదితర చోట్ల టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ అధికారప్రతినిధి  ఇంటిపై వైసీపీ నాయకుల దాడులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌  కోవింద్‌కు వివరించడానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి వెళ్లారు. సోమవారం చంద్రబాబు బృందం  రాష్ట్రపతికి ఏపిలో టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులు,  పోలీసుల ఏకపక్షచర్యలపై రాష్ట్రపతికి వివరించారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన గురించి  చంద్రబాబు బృందం వివరించింది. అలాగే పలువురు కేంద్ర మంత్రుల ను కూడా చంద్రబాబు బృందం కలువనుంది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు బృందం డిమాండ్‌ చేసినట్లు బీసీ పేర్కొన్నారు. 


Updated Date - 2021-10-26T04:34:02+05:30 IST