10 లక్షల మందితో ప్రధాని మోదీ (Modi) సభ: Bandy Sanjay
ABN , First Publish Date - 2022-06-21T16:35:40+05:30 IST
జులై 2, 3, 4 తేదీల్లో బీజేపీ
Hyderabad: జులై 2, 3, 4 తేదీల్లో భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్, నోవాటెల్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandy Sanjay) మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జులై 3వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. సుమారు 10 లక్షల మందితో ప్రధాని సభను నిర్వహిస్తామని తెలిపారు. దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రి అమిత్ షా, నడ్డా, స్థానిక నేతలు పాల్గొంటారన్నారు.
కాగా హైదరాబాద్లో జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాల కోసం కేంద్ర క్యాబినెట్, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన 18 మంది సీఎంలు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, 350 మంది ప్రతినిధులు వస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. అయితే రెండు రోజుల పాటు ప్రధాని మోదీతో హైదరాబాద్లో రోడ్డు షో నిర్వహించాలని భావించిన బీజేపీ... రోడ్డు షో కంటే భారీ బహిరంగ సభ మంచిదనే నిర్ణయానికొచ్చింది.