23న విద్యాసంస్థల బంద్‌

ABN , First Publish Date - 2022-08-19T04:54:59+05:30 IST

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈనెల 23న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వినోద్‌, రవి, రాజు, కైలాస్‌ కోరారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.

23న విద్యాసంస్థల బంద్‌

కాశీబుగ్గ: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈనెల 23న విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వినోద్‌, రవి, రాజు, కైలాస్‌ కోరారు.  గురువారం సీఐటీయూ కార్యాలయంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, 3,4,5 తరగతుల విలీనాన్ని నిలుపుదల చేయాలన్నారు. విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌  పోస్టులు భర్తీ చేయాలన్నారు. 

 

Updated Date - 2022-08-19T04:54:59+05:30 IST