23న విద్యాసంస్థల బంద్
ABN , First Publish Date - 2022-08-19T04:54:59+05:30 IST
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈనెల 23న విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వినోద్, రవి, రాజు, కైలాస్ కోరారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో బంద్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
కాశీబుగ్గ: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఈనెల 23న విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు వినోద్, రవి, రాజు, కైలాస్ కోరారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో బంద్కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, 3,4,5 తరగతుల విలీనాన్ని నిలుపుదల చేయాలన్నారు. విశ్వ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.