HYD : ఈ ఏడాది బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం..
ABN , First Publish Date - 2021-08-29T15:57:08+05:30 IST
అత్యంత ప్రాచుర్యం పొందిన బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ఈ ఏడాది
హైదరాబాద్ సిటీ/సరూర్నగర్ : అత్యంత ప్రాచుర్యం పొందిన బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ఈ ఏడాది యథావిధిగా జరగనుంది. కరోనా కారణంగా గత ఏడాది లడ్డూ ప్రసాదం వేలం, సామూహిక ఊరేగింపును రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించడంతో బాలాపూర్లోనూ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఉత్సవ సమితి నిర్ణయించింది. 27 సంవత్సరాలుగా నిరాడంబరంగా సాగిన గణేష్ లడ్డూ వేలం.. చరిత్రలో తొలిసారిగా 2020లో నిలిచిపోయింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని, నిమజ్జనోత్సవం రోజు లడ్డూ వేలం ఉంటుందని బాలాపూర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్రెడ్డి తెలిపారు.