వామనావతారంలో బలభద్రుడు
ABN , First Publish Date - 2022-07-07T05:45:37+05:30 IST
టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రఽథయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
మహారాణిపేట, జూలై 6: టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రఽథయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా టౌర్నర్ చౌల్ర్టీ కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన జగన్నాఽథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. దశావతారాలలో భాగంగా ఐదవ రోజు బుధవారం బలభద్రుడు వామనావతారంలో, జగన్నాథ స్వామి నృసింహ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయింత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గురువారం స్వామి వారు పరశురామావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.