ఏపీ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్య సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మద్దిశెట్టి శ్రీధర్‌

ABN , First Publish Date - 2021-03-04T06:26:44+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్య సం ఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒం గోలులోని పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ మద్దిశెట్టి శ్రీధర్‌ ఎంపికయ్యారు.

ఏపీ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్య సంఘ   రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మద్దిశెట్టి శ్రీధర్‌
మద్దిశెట్టి శ్రీధర్‌

విజయవాడలోయూనియన్‌ సమావేశం

ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీధర్‌కు పలువురి అభినందనలు

(ఒంగోలు ఆంధ్రజ్యోతి)

ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్య సం ఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒం గోలులోని పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ మద్దిశెట్టి శ్రీధర్‌ ఎంపికయ్యారు. విజయవాడలో బుధవారం జరిగిన సంఘ సభ్యుల సమావేశంలో శ్రీధర్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కళాశాల బాధ్యతలు చూస్తున్న శ్రీధర్‌ దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు సోదరుడు. అసోసియేషన్‌లో తొలి ను ంచి శ్రీఽధర్‌ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఏకగ్రీవంగా శ్రీధర్‌ ఎంపిక కావడంపై జిల్లాలోని ఇతర అసోసియేషన్‌ సభ్యులు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, అసోసియేషన్‌లో జాయింట్‌ సెక్రటరీగా క్విస్‌ విద్యా సంస్థల అధినేత కల్యాణచక్రవర్తి ఎంపికయ్యారు. అ లాగే జిల్లాకు చెందిన ఏబీఆర్‌ కాలేజీ కరస్పాండెంట్‌ సుబ్బారెడ్డి కార్యవ ర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు. జిల్లా అసోసియేషన్‌కు శ్రీధర్‌ కొన్నేళ్లగా అ ధ్యక్షుడిగా వ్యవహరిస్తూ పదోన్నతి పొందారు.

Updated Date - 2021-03-04T06:26:44+05:30 IST