ముఠా కార్మికుల పొట్టకొట్టిన జగన్: ఎమ్మెల్యే గద్దె
ABN , First Publish Date - 2022-08-11T05:59:12+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ముఠా కార్మికుల పొట్టకొట్టారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శిం చారు.
స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న గద్దె
ముఠా కార్మికుల పొట్టకొట్టిన జగన్: ఎమ్మెల్యే గద్దె
పటమట, ఆగస్టు 10: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల ముఠా కార్మికుల పొట్టకొట్టారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శిం చారు. బుధవారం ఉదయం 13వ డివిజన్ జేడీ నగర్ ఏరియాలో ఎమ్మెల్యే గద్దె బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించి, స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం స్వయం ఉపాధి నిమిత్తం జి.శ్రీనివాసరావు, పి.శ్రీనివాస్లకు రెండు ఇస్త్రీ బళ్లను గద్దె అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రతి ముఠా కార్మికుడు ఉపాధి కోల్పోయి, నగరాన్ని వదిలి సొంత ఊళ్లకు వెళ్లే పరిస్థితి కల్పించారన్నారు. ఏ రాష్ట్రంలోనైనా కార్మికులకు చేతినిండా పనులుండి కొంత డబ్బు సంపాదించుకుని కడుపునిండా తినగలిగితేనే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ ఎంతో మంది పేదలకు ఉపాధి మార్గాలు కల్పించేందుకు ఇస్త్రీ పెట్టెలు, కుట్టుమెషీన్లు, తోపుడు, రిక్షా బళ్లు, బడ్డీకొట్లు అందజేస్తున్న గద్దెకు ప్రజలంతా అండగా ఉండాలన్నారు. డివిజన్ పార్టీ అధ్యక్షుడు గద్దె ప్రసాద్, పేరేపి ఈశ్వర్, కొర్రపాటి శ్రీను, నూతి శ్రీనివాస్, శొంఠి సాయిలక్ష్మి, చలసాని రమణ వేములపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.