ఘనంగా మకరజ్యోతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-01-16T05:39:36+05:30 IST

పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో మకరజ్యోతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మకరజ్యోతి ఉత్సవాలు
అయ్యప్పకు పూజలు చేస్తున్న మాజీ మంత్రి అయ్యన్న దంపతులు

  నర్సీపట్నం, జనవరి 15 : పట్టణంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో మకరజ్యోతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా ఇక్కడున్న అయ్యప్ప ఆలయంలో ఉదయం నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు జరిపారు. తొలుత పట్టణ పురవీధుల్లో స్వామి వారిని రథంలో ఊరేగించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు దంపతులు రథయాత్రలో పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణలో యువత భాగస్వామ్యం పెరగాలన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరూ విరాళాలు అందజేయాలని కోరారు. గజముఖ నృత్య అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు దాతలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T05:39:36+05:30 IST