రామ మందిరానికి భారీ విరాళాలు

ABN , First Publish Date - 2021-03-08T05:08:01+05:30 IST

ప్రత్తిపాడు, మార్చి 7: అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ప్రత్తిపాడు మండలం నుంచి రూ.10 లక్షల 65వేలు విరాళాలు సేకరించినట్టు నిధి సేకరణకమిటీ సభ్యులు ముక్కు సుబ్రహ్మణ్యం, సింగిల్‌దేవి సత్తిరాజు, బర్రే కోటేశ్వరరావు, రాసంశెట్టి రాజా తెలిపారు. ఆదివారం మునసబువా

రామ మందిరానికి భారీ విరాళాలు

ప్రత్తిపాడు, మార్చి 7: అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి ప్రత్తిపాడు మండలం నుంచి రూ.10 లక్షల 65వేలు విరాళాలు సేకరించినట్టు నిధి సేకరణకమిటీ సభ్యులు ముక్కు సుబ్రహ్మణ్యం, సింగిల్‌దేవి సత్తిరాజు, బర్రే కోటేశ్వరరావు, రాసంశెట్టి రాజా తెలిపారు. ఆదివారం మునసబువారి రామాలయం వద్ద నిధుల సేకరణ ముగింపు సమావేశం నిర్వహించారు. రూ.లక్ష విరాళం ఇచ్చిన మండలానికి చెందిన సొగసాని సత్యనారాయణను అయోధ్య కరసేవలో పాల్గొన్న కేసారపు సత్తిరాజులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ నాయకులు సుబ్బారావు, సత్యరామచంద్రరావు, బికెఎస్‌ రాష్ట్ర నాయకుడు యల్లపు సూర్యనారాయణ, స్థానిక ప్రముఖులు సిట్రా అప్పారావు, కొప్పన కోటేశ్వరరావు, దొడ్డిపట్ల సోమన్నదొర, చుక్కల సత్యనారాయణ, జువ్వల కొండలరావు, వోలేటి రామకృష్ణ, మేకల బద్రం, భాణం రాజబాబు, సూరవరపు రమేష్‌, భద్రరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T05:08:01+05:30 IST