వృద్ధులపై వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-06-16T06:06:04+05:30 IST
వృద్ధాప్యాన్ని ప్రతి ఒక్కరూ చవిచూడాల్సిందేనని, వారిపై జరిగే వేధింపులను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా సమాజంపైనా ఉందని సామాజిక విశ్లేషకుడు డాక్టర్ ఎంసీ దాస్ అన్నారు.
వృద్ధులపై వేధింపుల నివారణకు చర్యలు తీసుకోవాలి
సామాజిక విశ్లేషకుడు డాక్టర్ ఎంసీ దాస్
గవర్నర్పేట, జూన్ 15: వృద్ధాప్యాన్ని ప్రతి ఒక్కరూ చవిచూడాల్సిందేనని, వారిపై జరిగే వేధింపులను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాకుండా సమాజంపైనా ఉందని సామాజిక విశ్లేషకుడు డాక్టర్ ఎంసీ దాస్ అన్నారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ- అవగాహన దినాన్ని పురస్కరించుకుని బుధవారం బందరు లాకుల సెంటర్లోని ఉమ్మడి కృష్ణాజిల్లా వయో వృద్ధుల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం ఆధ్వర్యంలో అవగాహన సభ జరిగింది. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు బి. కీర్తి, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వి. బాబూరావు, ఎం. వెంకటేశ్వరరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పెన్షనర్లు పాల్గొన్నారు.