సూక్ష్మ కళతో ఓటు హక్కుపై అవగాహన
ABN , First Publish Date - 2021-01-25T06:40:56+05:30 IST
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించేందుకు సూక్ష్మ కళాకారుడు దార్ల రవి శనివారం అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించాడు.
నక్కపల్లి, జనవరి 24 : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పించేందుకు సూక్ష్మ కళాకారుడు దార్ల రవి శనివారం అద్భుత కళాఖండాన్ని ఆవిష్కరించాడు. మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన ఈ కళాకారుడు సందర్భానుసారం తనలోని కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. తాజాగా చెక్కపై ఓటు హక్కు చిత్రాన్ని చెక్కి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.