మా ఎమ్మెల్యేలు విహార యాత్రకే వెళ్లారు : రాజస్థాన్ బీజేపీ చీఫ్

ABN , First Publish Date - 2020-08-08T22:36:51+05:30 IST

తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గుజరాత్ కు విహార యాత్రకే వెళ్ళారని రాజస్థాన్ బీజేపీ

మా ఎమ్మెల్యేలు విహార యాత్రకే వెళ్లారు : రాజస్థాన్ బీజేపీ చీఫ్

జైపూర్ : తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గుజరాత్ కు విహార యాత్రకే వెళ్ళారని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా స్పష్టం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలందరూ ఐక్యంగానే ఉన్నారని ఆయన ప్రకటించారు. అధికార కాంగ్రెస్ కావాలనే లేని పోని పుకార్లు సృష్టిస్తోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.


‘‘మా పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గుజరాత్‌కు విహార యాత్ర నిమిత్తమై వెళ్తున్నారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతున్న రోజు వారు కచ్చితంగా హాజరవుతారు. బీజేపీ ఎమ్మెల్యేలు సంఘటితంగానే ఉన్నారు. కాంగ్రెస్ లేనిపోని పుకార్లు సృష్టిస్తోంది. మా ఎమ్మెల్యేలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్సే వారి ఎమ్మెల్యేలను నమ్మదు.’’ అని ఆయన ఆరోపించారు.


రాజస్థాన్ పోలీసులు ముఖ్యమంత్రి గెహ్లోత్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, బీజేపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారని సతీశ్ పూనియా తీవ్రంగా ఆరోపించారు. 

Updated Date - 2020-08-08T22:36:51+05:30 IST