AP News: 20న కడప జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

ABN , First Publish Date - 2022-08-19T02:14:15+05:30 IST

Kadapa: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 20వ తేదీ కడప జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆయన చెక్కులు అందజేస్తారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బలవన్మరణానికి పాల్పడ్డ ప్రతి కౌలు రైతు

AP News: 20న కడప జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

Kadapa: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ నెల 20వ తేదీ కడప జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఆయన చెక్కులు అందజేస్తారని మీడియా సమావేశంలో పేర్కొన్నారు. బలవన్మరణానికి పాల్పడ్డ ప్రతి కౌలు రైతు కుటుంబానికి పవన్ కల్యాణ్ రూ. లక్ష సొంత నిధులు ఇస్తున్నారని, ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎవరూ చేయడం లేదని తెలిపారు. సీఎం జగన్ సొంత జిల్లాలో కూడా రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి పార్టీలకు అతీతంగా జనసేన ఎల్లపుడూ ముందుంటుందన్నారు. రైతు భరోసా కేంద్రాలకు రూ.వేల కోట్లు కేటాయించామని చెప్పుకుంటున్న వైసీపీ (YSRCP) నేతల మాటలు బూటకమన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికి పరిస్థితి  అధ్వానంగా ఉందని.. కడప జిల్లాలో వరదల సమయంలో జనసైనికులు ముందుకు వెళ్లి ప్రజలకు సేవలు చేశారని గుర్తు చేశారు. 

Updated Date - 2022-08-19T02:14:15+05:30 IST