చట్టాలపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-11-27T04:21:22+05:30 IST

న్యాయవ్యవస్థ, చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని లోక్‌ అదాలత్‌ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి పీ.పాండురంగారెడ్డి తెలిపారు.

చట్టాలపై అవగాహన ఉండాలి
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి పాండురంగారెడ్డి

సీనియర్‌ సివిల్‌ జడ్జి పాండురంగారెడ్డి

కావలి, నవంబరు 26: న్యాయవ్యవస్థ, చట్టాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని లోక్‌ అదాలత్‌ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి పీ.పాండురంగారెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ దినోత్సవం, న్యాయదినోత్సవం సందర్భంగా శుక్రవారం మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కోర్టు భవనాల సముదాయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వైజే పద్మశ్రీ, స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ వై.పరుశురామ్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే.సురేందర్‌ రెడ్డి, ఏజీపీ పోట్లూరి శ్రీనివాసులు, న్యాయవాదులు ఐ.మాల్యాద్రి, సాయిప్రసాద్‌, రాజేంద్రప్రసాద్‌, నరసింహారావు తదితలు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T04:21:22+05:30 IST