అవనిగడ్డ ఎమ్మెల్యే రమేష్కు మాతృవియోగం
ABN , First Publish Date - 2021-12-02T17:42:21+05:30 IST
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మాతృ వియోగం కలిగింది.
విజయవాడ: అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు మాతృవియోగం కలిగింది. వార్ధక్యంతో కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యే తల్లి భారతమ్మ కన్నుమూశారు. ఈ సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్యే తల్లి భారతమ్మ మృతి పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.