బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2020-10-27T12:16:27+05:30 IST
భారతీయ జనతాపార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....
న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ ఎంపీ సాక్షి మహారాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్మశానవాటికలు సమాజ జనాభా ప్రాతిపదికన ఉండాలని ఉన్నవో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ అన్నారు.బాగర్ మౌ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సమావేశంలో మాట్లాడుతూ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘ఒక గ్రామంలో ఒకే ఒక ముస్లిం ఉంటే, వారి శ్మశానవాటిక చాలా పెద్దది. ముస్లిమ్ మరణిస్తే అతన్ని పొలంలో లేదా గంగా నది వైపు దహనం చేయండి. ఒక్క ముస్లిమ్ కోసం పెద్ద శ్మశానవాటిక ఏర్పాటు చేయడం అన్యాయం కాదా? అందుకే శ్మశానవాటికలు జనాభా నిష్పత్తి ప్రకారం ఉండాలి’’ అని ఎంపీ సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు.