ఆర్టీసీ డోర్ డెలివరీ సేవలను వినియోగించుకోండి
ABN , First Publish Date - 2022-08-18T05:40:07+05:30 IST
ఏపీఎస్ ఆర్టీసీ సరుకుల డోర్ డెలివరీ సేవలను ప్రజ లు వినియోగించుకోవాలని ఆ సంస్థ అధికారులు కోరారు.
అరసవల్లి ఆగస్టు 17:ఏపీఎస్ ఆర్టీసీ సరుకుల డోర్ డెలివరీ సేవలను ప్రజ లు వినియోగించుకోవాలని ఆ సంస్థ అధికారులు కోరారు. శ్రీకాకుళం డీపీటీవో ఎ.విజయ కుమార్ ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వ హించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. శ్రీకాకుళం 2వ డిపోనుంచి 7 రోడ్ల జంక్షన్, పాత బస్టాండ్, చిన్నబ జార్, రైతుబజార్ వరకు ర్యాలీ సాగింది. ఈ సంద ర్భంగా డిపో మేనేజర్లు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఆర్టీసీ లక్ష్యమన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా 84 ప్రధాన పట్టణాల్లో 50 కేజీల వరకు సరు కులను, 10 కిలోమీటర్ల పట్టణ పరిధిలో 24 గంటల్లోనే డోర్ డెలివరీ సౌకర్యం కల్పి స్తున్నామన్నారు. వర్తకులు, ప్రజలు సహకరించి ప్రోత్సాహం అందించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1, 2 డిపో మేనేజర్లు కె.మాధవ్, కేఆర్ఎస్.శర్మ, సిబ్బంది బి.రవికుమార్, వి.రమేష్, ఎ.ఆదినారాయణ, వి.శామ్యూల్, తదితరులు పాల్గొన్నారు.