ఆటోనగర్ అభివృద్ధికి సహకరించండి
ABN , First Publish Date - 2021-01-27T06:05:34+05:30 IST
ఆటోనగర్ ఐలా కార్యాలయంలో మంగళవారం పారిశ్రామికవేత్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు.
ఐలా కమిషనర్
ఆటోనగర్: ఆటోనగర్ ఐలా కార్యాలయంలో మంగళవారం పారిశ్రామికవేత్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలా కమిషనర్ శామ్యూల్ మాట్లాడుతూ పరిశ్రమలు ప్రాపర్టీ ట్యాక్స్ను సకాలంలో చెల్లించి ఆటోనగర్ అభివృద్ధికి సహకరించాలని కోరారు ఏపీఐఐసీ ఆద్వర్యంలో నడుస్తున్న పరిశ్రమలకు ట్రేడ్ లైసెన్స్ వర్తించదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వాసివా అధ్యక్షులు ఏకే బాలాజీ మాట్లాడుతూ పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.