అత్యాచారయత్నం కేసులో ఆటో డ్రైవర్కు ఏడేళ్ల జైలు
ABN , First Publish Date - 2020-12-03T05:21:34+05:30 IST
అత్యాచారయత్నం కేసులో ఓ ఆటోడ్రైవర్కు ఏడేళ్ల జైలు, రూ.45 వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ న్యాయ మూర్తి కె.సుధామణి తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం కొత్తవలస సీఐ జి.గోవిందరావు తెలియజేశారు.
కొత్తవలస : అత్యాచారయత్నం కేసులో ఓ ఆటోడ్రైవర్కు ఏడేళ్ల జైలు, రూ.45 వేలు జరిమానా విధిస్తూ విజయనగరం ఒకటో అదనపు జిల్లా సెషన్స్ న్యాయ మూర్తి కె.సుధామణి తీర్పు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం కొత్తవలస సీఐ జి.గోవిందరావు తెలియజేశారు. 2016 డిసెంబరు 27న మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న బాలిక కొత్తవలసలో ఆటో ఎక్కి ఇంటికి బయల్దేరింది. ప్రయాణికులంతా దిగిపోయిన తర్వాత ముసిరాం-కళ్లేపల్లి గ్రామాల మధ్యలో ఆ బాలికపై లక్కవరపుకోట మండలం, లచ్చంపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కాకర వీరాస్వామి అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో ఆ బాలిక ప్రతిఘటించి ఇంటికి చేరింది. విషయం తెలుసుకున్న తల్లిదం డ్రులు కొత్తవలస పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అప్పటి సీఐ జి.సంజీవరావు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... వీరాస్వామిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి విజ యనగరం జిల్లా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా... ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్టు సీఐ గోవిందరావు తెలిపారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్ కొండపల్లి సూర్యప్రకాష్ బాలిక తరఫున వాదించారు.