పంద్రాగస్టున అందరూ ఖాదీ దుస్తులు ధరించాలి
ABN , First Publish Date - 2022-02-05T17:51:09+05:30 IST
ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 15న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఖాదీ దుస్తులు ధరించాలని, ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడేలా చేయాలని కేంద్ర ఖాదీ, గ్రామోద్యోగ మండలి వినతిపై
- ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకం రెపరెపలాడాలి
- ఖాదీబోర్డు వినతికి ప్రభుత్వం సానుకూలం
బెంగళూరు: ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఆగస్టు 15న రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఖాదీ దుస్తులు ధరించాలని, ఇంటిపై జాతీయ పతాకం రెపరెపలాడేలా చేయాలని కేంద్ర ఖాదీ, గ్రామోద్యోగ మండలి వినతిపై మున్సిపల్ వ్యవహారాలు, చిన్నపరిశ్రమల శాఖ మంత్రి ఎంటీబీ నాగరాజ్ సానుకూలంగా స్పందించారు. బోర్డు కమిషన్ దక్షిణవిభాగం సభ్యుడు శేఖర్రావ్ పెరెల శుక్రవారం విధానసౌధలో మంత్రితో భేటీ అయి చర్చలు జరిపారు. కేంద్ర ఖాదీ గ్రామోద్యోగ కమిషన్, రాష్ట్ర ఖాదీ గ్రామోద్యోగ మండలి అందరినీ ప్రేరేపించేలా కార్యక్రమాలు రూపొందించడం హర్షణీయమని మంత్రి నాగరాజ్ అభిప్రాయపడ్డారు. అనంతరం శేఖర్రావ్ మీడియాతో మాట్లాడుతూ ఖాదీ ఉత్పత్తుల వస్తు ప్రదర్శన, మేళాలకు మైసూరు లేదా దావణగెరెలలో అవకాశం కల్పించాలని కోరామన్నారు. యువ పారిశ్రామికవేత్తలలో ఆదర్శవంతులైనవారిని పరిచయం చేయాలన్నారన్నారు. సమావేశంలో రాష్ట్ర ఖాదీ గ్రామోద్యోగ మండలి ముఖ్యకార్యనిర్వహణాధికారి నాగరాజ్రెడ్డి, కేంద్ర ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ రాష్ట్ర డైరెక్టర్ మోహన్రావ్ తదితరులు పాల్గొన్నారు.