డిగ్రీ, పీజీలో ప్రవేశానికి ఆగస్టు12 ఆఖరి గడువు

ABN , First Publish Date - 2021-07-26T07:04:44+05:30 IST

బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన యూనివర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశానికి సంబంధించి ఆగస్టు 12వ తేదీ చివరి గడువు అని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ బి.ధర్మానాయక్‌ అన్నారు.

డిగ్రీ, పీజీలో ప్రవేశానికి ఆగస్టు12 ఆఖరి గడువు
విలేకరులతో మాట్లాడుతున్న ధర్మానాయక్‌

నల్లగొండ క్రైం, జూలై 25 : బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన యూనివర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశానికి సంబంధించి ఆగస్టు 12వ తేదీ చివరి గడువు అని యూనివర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌ బి.ధర్మానాయక్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రీజియన కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అతి తక్కువ ఫీజుతో ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక యూనివర్సిటీ బీఆర్‌ఏఓయూ అని, రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ సీతారామారావు ఆధ్వర్యంలో ముమ్మరంగా ఆనలైన అడ్మీషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 10 అధ్యయన కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సెంటర్‌లో ప్రవేశం పొందవచ్చన్నారు. ఎంబీఏ కోర్సులో చేరేందుకు  ఖచ్చితంగా ఐసెట్‌ అర్హత సాధించాలన్నారు. అదే విధంగా డిగ్రీ ద్వితీయ, తృతీయ, పీజీ ద్వితీయ సంవత్సరం విద్యారు్‌థల తమ ట్యూషన ఫీజును ఆగస్టు 12లోగా ఆనలైనలో చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు 08682 223768, 7989339180, 9533101295 నెంబర్లను సంప్రదించాలన్నారు. 


Updated Date - 2021-07-26T07:04:44+05:30 IST