బాలిక కిడ్నా్‌పనకు యత్నం

ABN , First Publish Date - 2021-09-19T04:21:52+05:30 IST

ఓ బాలిక (10)ను ఇద్దరు యువకులు కిడ్నా్‌పనకు చేసేందుకు యత్నించిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది.

బాలిక కిడ్నా్‌పనకు యత్నం

పట్టుబడిన ఇద్దరు యువకులకు దేహశుద్ధి

సంగారెడ్డి క్రైం, సెప్టెంబరు 18 : ఓ బాలిక (10)ను ఇద్దరు యువకులు కిడ్నా్‌పనకు చేసేందుకు యత్నించిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో శనివారం చోటు చేసుకున్నది. సంగారెడ్డి పట్టణంలోని ఓ హోటల్‌లో బాలిక, తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తున్నారు. అదే హోటల్‌లో కంది గ్రామానికి చెందిన ఎన్‌.నగేష్‌ (20), సదాశివపేటకు చెందిన బి.సాయికిరణ్‌ (23) కూడా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం సదరు యువకులు వినాయకులను చూపిస్తామంటూ బాలికను బైక్‌పై ఎక్కించుకుని వెళ్లారు. ముందుగా పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్‌పైకి తీసుకెళ్లి చూపించారు. తర్వాత అక్కడి నుంచి జోగిపేటకు తీసుకెళ్తున్న క్రమంలో శివంపేట గ్రామ శివారులోని కల్లు దుకాణంలోకి వెళ్లారు. అక్కడ రోదిస్తున్న బాలికను చూసిన కొందరు స్థానికులు విషయం తెలుసుకుని యువకులకు దేహశుద్ధి చేశారు. అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో పాటు సంగారెడ్డి రూరల్‌ పోలీసులకు బాలికను అప్పగించారు. నిందితులిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలిసింది. ఈ విషయమై సంగారెడ్డి డీఎస్పీ బాలాజీనాయక్‌ మాట్లాడుతూ నిందితులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశామని తెలిపారు. 

Updated Date - 2021-09-19T04:21:52+05:30 IST