దాడి కేసులో ఐదుగురిపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-11-29T06:31:17+05:30 IST
దాడి కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జి.సురేంద్ర తెలిపారు.
పి.గన్నవరం, నవంబరు 28: దాడి కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ జి.సురేంద్ర తెలిపారు. స్థానిక బాలబాలజీ థియేటర్ ఎదుట గల మిల్క్ డెయిరీలో శ్రీనివాసరరావు పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి డెయిరీ ఎదుట ఇద్దరు వ్యక్తులు బైక్ పార్కు చేశారు. పాల వ్యాన్ వస్తుంది, బైక్ తీయాలని శ్రీనివాసరావుకు వారికి సూచించాడు. దీంతో వివాదం జరిగింది. ఇద్దరితో పాటు మరో ముగ్గురు తనపై దాడచేసి కుల పేరుతో దూషించారని శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.