అధికారులపై దాడులను సహించం: భద్రాద్రి కలెక్టర్
ABN , First Publish Date - 2020-04-04T10:24:00+05:30 IST
ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులపై భౌతిక దాడులకు పాల్పడితే సహించేది లేదని కలెక్టర్ డాక్టర్ ఎంవీ. రెడ్డి
కొత్తగూడెం కలెక్టరేట్, ఏప్రిల్ 3 : ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులపై భౌతిక దాడులకు పాల్పడితే సహించేది లేదని కలెక్టర్ డాక్టర్ ఎంవీ. రెడ్డి హె చ్చరించారు. దుమ్ముగూడెం ఎంపీడీవోపై ఓ యువకుడు దాడికి పాల్పడటాన్ని ఖండిస్తూ ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల జేశారు. ప్రజలు లాక్డౌన్ అదేశాలను పాటించాల్సిందేనన్నారు. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలో కొంతమంది యువకులు గుంపులుగా గుమ్మికూడటాన్ని గమనించిన ఎంపీడీవో వారిని హెచ్చరిస్తే.. ఆమెపై దాడికి పాల్పడటం విచారకరమన్నారు. అయితే ఎంపీడీవోపై జరిగిన దాడి ఘటనలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంపట్ల ఎంపీడీవో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, రమేష్... కలెక్టర్ ఎంవీరెడ్డి, ఎస్పీ సునీల్దత్కు కృతజ్ఙతలు తెలిపారు.