భార్యపై దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-07-04T05:45:49+05:30 IST

భార్యపై దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం

భార్యపై దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం

కొత్తూర్‌, జూలై 3: మద్యం మత్తులో భార్యతో గొడవపడిన భర్త గొడ్డలితో భార్యపై దాడి చేయడమే కాక బ్లేడ్‌తో తన కడుపులో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కొత్తూర్‌ మున్సిపల్‌ పరిధిలోని స్టేషన్‌ తిమ్మాపూర్‌లో అదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శంకర్‌ కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన బాలమైసయ్య, భార్య దేవమ్మలు కొంత కాలం క్రితం స్టేషన్‌ తిమ్మాపూర్‌కు వలసవచ్చి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం బాలమైసయ్య మద్యంతాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడై దేవమ్మపై గొడ్డలితో దాడికి దిగాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. వీరి గొడవను చూసిన స్థానికులు బాలమైసయ్యను మందలించారు. దీంతో అతడు బ్లేడుతో తన కడుపు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శంకర్‌ తనసిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకొని గాయాలపాలైన ఇరువురిని చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. బాలమైసయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు.  

Updated Date - 2022-07-04T05:45:49+05:30 IST