వివాహితపై కత్తితో దాడి
ABN , First Publish Date - 2022-05-28T08:57:12+05:30 IST
చంపాపేట, మే 27(ఆంధ్రజ్యోతి): అది హైదరాబాద్లోని పాతబస్తీ. కంచన్బాగ్ పరిధిలోని హఫీజ్బాబానగర్. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఓ వివాహితపై
- ప్రేమను కాదనడంతో యువకుడి దారుణం
- హైదరాబాద్లో పట్టపగలు అందరూ చూస్తుండగా ఘటన
చంపాపేట, మే 27(ఆంధ్రజ్యోతి): అది హైదరాబాద్లోని పాతబస్తీ. కంచన్బాగ్ పరిధిలోని హఫీజ్బాబానగర్. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఓ వివాహితపై వెనుక నుంచి ఓ యువకుడు దాడి చేశాడు. రోడ్డు మీద అందరూ చూస్తుండగా కత్తితో ఆమె ముఖం, మెడ, దవడ, కుడి చేతిపై ఇష్టం వచ్చినట్లు పొడిచాడు! శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కంచన్బాగ్ సీఐ ఉమామహేశ్వర్రావు కథనం ప్రకారం హఫీజ్బాబానగర్కు చెంది న సైదానూర్బాను(40)కు ఇద్దరు కుమారులు, ఓ కూ తురు. మూడేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న షేక్ నసీరుద్దీన్ అలియాస్ హబీబ్(32)అనే వ్యక్తి ప్రేమ పేరుతో సైదానూర్బాను వెంట పడుతున్నాడు. శుక్రవారం హఫీజ్బాబానగర్లో ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా హబీబ్ వెను క నుంచి వెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొ డిచాడు. తీవ్ర గాయాలతో కింద పడిపోయిన ఆమెను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సీఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నడని, కేసు నమోదు చేశామని వెల్లడించారు.