వివాహితపై కత్తితో దాడి

ABN , First Publish Date - 2022-05-28T08:57:12+05:30 IST

చంపాపేట, మే 27(ఆంధ్రజ్యోతి): అది హైదరాబాద్‌లోని పాతబస్తీ. కంచన్‌బాగ్‌ పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఓ వివాహితపై

వివాహితపై కత్తితో దాడి

- ప్రేమను కాదనడంతో యువకుడి దారుణం  

- హైదరాబాద్‌లో పట్టపగలు అందరూ చూస్తుండగా ఘటన 

చంపాపేట, మే 27(ఆంధ్రజ్యోతి): అది హైదరాబాద్‌లోని పాతబస్తీ. కంచన్‌బాగ్‌ పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఓ వివాహితపై వెనుక నుంచి ఓ యువకుడు దాడి చేశాడు. రోడ్డు మీద అందరూ చూస్తుండగా కత్తితో ఆమె ముఖం, మెడ, దవడ, కుడి చేతిపై ఇష్టం వచ్చినట్లు పొడిచాడు! శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కంచన్‌బాగ్‌  సీఐ ఉమామహేశ్వర్‌రావు కథనం ప్రకారం హఫీజ్‌బాబానగర్‌కు చెంది న సైదానూర్‌బాను(40)కు ఇద్దరు కుమారులు, ఓ కూ తురు.   మూడేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న షేక్‌ నసీరుద్దీన్‌ అలియాస్‌ హబీబ్‌(32)అనే వ్యక్తి ప్రేమ పేరుతో సైదానూర్‌బాను వెంట పడుతున్నాడు. శుక్రవారం  హఫీజ్‌బాబానగర్‌లో ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా హబీబ్‌ వెను క నుంచి వెళ్లి కత్తితో విచక్షణారహితంగా పొ డిచాడు. తీవ్ర గాయాలతో కింద పడిపోయిన ఆమెను చికిత్స నిమిత్తం ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని  సీఐ తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నడని, కేసు నమోదు చేశామని వెల్లడించారు.  

Updated Date - 2022-05-28T08:57:12+05:30 IST