కలవకూరు ఇసుక డంప్పై దాడి
ABN , First Publish Date - 2020-08-07T11:26:02+05:30 IST
అక్రమం గా నిల్వ ఉంచిన ఇసుక డం ప్పై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడి చేసి 70 టన్నులు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 70 టన్నులు స్వాధీనం
అద్దంకి, ఆగస్టు 6 : అక్రమం గా నిల్వ ఉంచిన ఇసుక డం ప్పై పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడి చేసి 70 టన్నులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం అద్దంకి సమీపంలో కలవకూరు రోడ్డులో ఇటుక బట్టీల వద్ద ఈ ఘటన జరిగింది. ఎస్ఈబీ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు రెవెన్యూ అధికారులు వీఆర్ఏ, వీఆర్వో సమక్షంలో ఇసుక డంప్పై దాడి చేసి 70 టన్నులు స్వాధీనం చేసుకున్నారు. కత్తి రత్నకుమార్ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.