న్యాయశాఖ ఉద్యోగిపై దాడి.. నగదు అపహరణ

ABN , First Publish Date - 2020-08-05T11:54:18+05:30 IST

రాజమహేంద్రవరం లాలాచెరువు స్వరూప్‌నగర్‌ వద్ద న్యాయశాఖ ఉద్యోగిపై దుండగులు దాడి చేసి కత్తులతో బెదిరించి నగదు లాక్కుని ..

న్యాయశాఖ ఉద్యోగిపై దాడి.. నగదు అపహరణ

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: రాజమహేంద్రవరం లాలాచెరువు స్వరూప్‌నగర్‌ వద్ద న్యాయశాఖ ఉద్యోగిపై దుండగులు దాడి చేసి కత్తులతో బెదిరించి నగదు లాక్కుని పరారయ్యారు. స్వరూప్‌నగర్‌లో ఉంటున్న బొబ్బిలి వెంకటపైడిరాజు రంపచోడవరం కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం విధులు ముగించుకుని రాజమహేంద్రవరం ఏవీఏ రోడ్డులోని ఏటీఎం వద్దకు వెళ్లి అక్కడ డబ్బులు డ్రా చేసుకుని అర్థరాత్రి బైక్‌పై ఇంటికి వెళుతుండగా ముగ్గురు దుండగులు పైడిరాజును అనుసరించి స్వరూప్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రదేశం వద్ద అతడి బైక్‌ను ఆపి దాడిచేసి కత్తులతో బెదిరించి 6వేల నగదు,  సెల్‌ఫోన్‌ లాక్కుని తుప్పల్లోకి గెంటేసి పారిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితుడు బొమ్మూరు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-08-05T11:54:18+05:30 IST