ఏటీఎం కార్డు తస్కరించి రూ.70వేలు డ్రా

ABN , First Publish Date - 2020-11-29T06:29:56+05:30 IST

ఏటీఏం కార్డును తస్కరించిన ఒక వ్యక్తి రూ.70వేలు డ్రా చేశాడు.

ఏటీఎం కార్డు తస్కరించి రూ.70వేలు డ్రా

ముమ్మిడివరం, నవంబరు 28: ఏటీఏం కార్డును తస్కరించిన ఒక వ్యక్తి రూ.70వేలు డ్రా చేశాడు. నగర పంచాయతీ టీటీఆర్‌ నగర్‌కు చెందిన సీహెచ్‌వీ రామకృష్ణంరాజు ఈనెల21న ముమ్మిడివరం ఎస్‌బీఐలో నగదు తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా వెనుక ఉన్న ఒక వ్యక్తి పాత ఏటీఎంకార్డు ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నాడు. రామకృష్ణంరాజు అక్కౌంట్‌ నుంచి అతడు ముమ్మిడివరం ఎస్‌బీఐ మెయిన్‌, బజారు బ్రాంచి ఏటీఎంల నుంచి, అమలాపురంలో ఒక జ్యూయలరీ షాపు నుంచి మొత్తం 70వేలు నగదు డ్రాచేశాడు.  దీంతో రామకృష్ణంరాజు  ఆ కార్డును బ్లాక్‌ చేయించి శనివారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కేవీ నాగార్జున కేసు  దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-29T06:29:56+05:30 IST