Hyderabad : కొత్తపేటలో ‘అతిథిదేవోభవ’ రెస్టారెంట్ ప్రారంభం..
ABN , First Publish Date - 2021-12-10T18:09:37+05:30 IST
కొత్తపేటలో ‘అతిథిదేవోభవ’ రెస్టారెంట్ ప్రారంభం..
హైదరాబాద్ సిటీ : భోజన ప్రియులుకు నోరూరించే వంటకాల రుచులను ఆతిథ్యం అందించేందుకు సీవీల్ గ్రూప్ ‘అతిథిదేవోభవ’ రెస్టారెంట్ ప్రారంభమైంది. హైదరాబాద్లోని కొత్తపేట నుంచి నాగోల్ వేళ్లే దారిలో అందుబాటులోకి తీసుకొచ్చింది సీవీల్ గ్రూప్. ఈ రెస్టారెంట్ను డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్, కార్పొరేటర్స్ వెంకట నర్సింహ, పవన్ కుమార్, ప్రేమ్ మహేష్, సామల హేమ, కండి శైలజ, సినీనటులు సర్లీన్ కౌర్, ఫారీదా యూసఫ్ మోడల్స్ కలిసి కొత్తపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంలో సినీనటిలు మాట్లాడుతూ.. విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్గా నిలుస్తుందన్నారు. తమకు మటన్, చికెన్ చాలా ఇష్టమని.. భోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు, ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వారు అన్నారు.
ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు మహిచంద్ మాట్లాడుతూ.. కొత్తపేటలో ‘అతిథిదేవోభవ’ రెస్టారెంట్ని ఏర్పాటు చేసినందుకు చాలా ఆనందంగా ఉంద్నారు. రెస్టారెంట్తో పాటు త్వరలో మరిన్ని సౌకర్యాలు అందుబాటులో తెస్తామన్నారు. రెస్టారెంట్కు డిజైన్ థీమ్ ప్రత్యేకమని, డైనింగ్ సెటప్లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారని మహిచంద్ వెల్లడించారు.