జగన్‌ను సూటిగా ప్రశ్నించిన అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2021-08-15T00:03:38+05:30 IST

సీఎం జగన్‌ను టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. అప్పుల ద్వారా తెచ్చిన సొమ్ము ఏమైందని నిలదీశారు.

జగన్‌ను సూటిగా ప్రశ్నించిన అచ్చెన్నాయుడు

విజయవాడ: సీఎం జగన్‌ను టీడీపీ నేత అచ్చెన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. అప్పుల ద్వారా తెచ్చిన సొమ్ము ఏమైందని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, సబ్ ప్లాన్ దుర్వినియోగం చేస్తున్నారని, స్కీముల పేరుతో స్కాములు చేస్తూ ప్రజా సంపద దోచేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రం లూఠీకి, దుబారాకు బలైంది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పన్నుల పెంపుతో ప్రజలపై రూ.75వేల కోట్లు అదనపు భారం మోపారని మండిపడ్డారు. 2019-21 మధ్య రూ.2,00,139 కోట్ల అప్పులు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.6,500 కోట్లు లూఠీ చేశారని, ప్రజలతో పిచ్చి మద్యం తాగిస్తూ ఏటా రూ.6వేల కోట్ల లూఠీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రెండేళ్లలో రూ.4లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Updated Date - 2021-08-15T00:03:38+05:30 IST