జగన్ పాలన ముగిసేసరికి రూ.10 లక్షల కోట్లు అప్పు: రామకృష్ణ

ABN , First Publish Date - 2022-08-03T01:02:40+05:30 IST

పశ్చిమ గోదావరి : సీపీఐ (CPI) భీమవరంలో ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) మాట్లాడారు. జగన్ (CM Jagan) పాలనను చూస్తుంటే.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం

జగన్ పాలన ముగిసేసరికి రూ.10 లక్షల కోట్లు అప్పు: రామకృష్ణ

పశ్చిమ గోదావరి : సీపీఐ (CPI) భీమవరంలో ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) మాట్లాడారు. జగన్ (CM Jagan) పాలనను చూస్తుంటే.. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అంటూ ఒకటి ఉందా? అనే సందేహం కలుగుతుందన్నారు.వైసీపీ ప్లీనరీలో జగన్ భజన తప్ప మరొకటి లేదని విమర్శించారు. పోలవరం (Polavaram), రైతులు, ప్రత్యేక హోదా (Special Status) గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. మహిళా మంత్రులు సైతం జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తడం తప్ప జనం సమస్యల గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. ప్లీనరీ మొత్తం చంద్రబాబునాయుడు, ఏబీఎన్ రాధాకృష్ణ , పవన్ కల్యాణ్‌ను తిట్టడంతోనే సరిపోయిందని పేర్కొన్నారు. జగన్ పాలన ముగిసేసరికి రూ.10 లక్షల కోట్లు అప్పు ఈ రాష్ట్రానికి ఉంటుందన్నారు. అక్టోబర్ 14 నుంచి 18వ తేదీ వరకూ విజయవాడలో పార్టీ అఖిలభారత మహసభలు ఉంటాయని తెలిపారు.

Updated Date - 2022-08-03T01:02:40+05:30 IST