అసైన్డ్ భుములకు రక్షణ కల్పించాలి
ABN , First Publish Date - 2022-01-02T05:28:19+05:30 IST
అసైన్డ్ భుములకు రక్షణ కల్పించాలి
మొయినాబాద్ రూరల్: అసైన్డ్ భూములకు ప్రభుత్వం రక్షణ కల్పించి పేదలకు చెందేవిధంగా కృషి చేయాలని అసైన్డ్ భూముల రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని హిమాయత్ నగర్లో ఆసైన్డ్ భుముల రక్షణ సమితి కమిటీ సభ్యులు శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మొయినాబాద్ మండలాధ్యక్షుడిగా హిమాయత్నగర్ గ్రామానికి చెందిన మాల రాజును ఎన్నుకోగా ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. అసైన్డ్ భూమి సమితి రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఉన్నారు.