అసోంను వణికిస్తున్న వరదలు.. మరో ఆరుగురి మృతి

ABN , First Publish Date - 2020-07-14T03:29:15+05:30 IST

వరదలు అసోంను వణికిస్తున్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. వరదల

అసోంను వణికిస్తున్న వరదలు.. మరో ఆరుగురి మృతి

గువాహటి: వరదలు అసోంను వణికిస్తున్నాయి. రోజురోజుకు పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. వరదల కారణంగా సోమవారం మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 50కి పెరిగింది. కొండచరియలు విరిగిపడడం వల్ల మరో 26 మంది మృతి చెందారు. అసోం విపత్తు నిర్వహణ అథారిటీ గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలోని 27 జిల్లాల్లోని 2,763 గ్రామాలకు చెందిన 21.63 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. 1,03,806 హెక్టార్ల పంట దెబ్బతింది. 


వరదల వల్ల పొంగి ప్రవహిస్తున్న నదుల కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. బ్రహ్మపుత్ర, ధన్‌సిరి, బుర్హి దెహింగ్, జియా భరాలి, పుథిమరి, బేకి, కోపిలి, శంకోష్, సుబన్‌సిరి, పగ్లాడియా, కతాఖల్, కుషియారా వంటి పెద్ద నదులు ఏడు ప్రాంతాల్లో ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 20 జిల్లాలో ఏర్పాటు చేసిన 480 పునరావాస కేంద్రాల్లో 60,696  మంది ఆశ్రయం పొందుతున్నారు.     

Updated Date - 2020-07-14T03:29:15+05:30 IST