వందసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలే..
ABN , First Publish Date - 2021-01-19T06:02:34+05:30 IST
ఎంపీగా యాదాద్రి సమస్య లపై తనను కలిస్తే ఒకరోజు మొత్తం చర్చిస్తానని చెప్పిన కేసీఆర్ వందసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. ఆయన సీఎం కాదు తుగ్లక్ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
కేసీఆర్ సీఎం కాదు తుగ్లక్
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
యాదాద్రి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఎంపీగా యాదాద్రి సమస్య లపై తనను కలిస్తే ఒకరోజు మొత్తం చర్చిస్తానని చెప్పిన కేసీఆర్ వందసార్లు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వలేదు.. ఆయన సీఎం కాదు తుగ్లక్ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాలను మోసం చేస్తున్నాడన్నారు. ప్రజలతో కలిసి పోరాటాలు చేసి కేసీఆర్ను జైలుకు పంపడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. యాదగిరిగుట్టలో రోడ్డు విస్తరణ బాధితుల రిలే దీక్షా శిబిరాన్ని సోమవారం సందర్శించిన ఎంపీ నిర్వాసితులకు సంఘీభావం ప్రకటించారు. సీఎం కేసీఆర్ మాయలో పడి మీరు బద్నాం కాకండి.. పాపాత్ముడి వెంట ఉండి పాపాలు చేయకండి అని వైష్ణవ పీఠాధిపతి త్రిదండి చినజీయర్ను పత్రికాముఖంగా కోరారు. సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి గెలవకపోతే రాజకీయాలు మాట్లాడబోనని ఆయన అన్నారు.