దాడికి పాల్పడినవారిని అరెస్టు చేయండి
ABN , First Publish Date - 2021-04-11T05:43:34+05:30 IST
మండలంలోని జాగరం గ్రామంలో దళితులపై దాడిని నిరసిస్తూ స్థానికులు జాగరం-జామి ప్రధాన రహదారిపై శనివారం రాస్తారోకో చేశారు.
శృంగవరపుకోట రూరల్(జామి): మండలంలోని జాగరం గ్రామంలో దళితులపై దాడిని నిరసిస్తూ స్థానికులు జాగరం-జామి ప్రధాన రహదారిపై శనివారం రాస్తారోకో చేశారు. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాలమాహా నాడు రాష్ట్ర కార్యదర్శి లోగిశ రామకృష్ణ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ దాడి జరిగి ఐదు రోజులవుతున్నా ఇంతవరకు కారకులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కలెక్టర్, ఎస్పీ గ్రామాన్ని సందర్శించలేదన్నారు. ఈ ప్రభుత్వంలో అంబేడ్కర్ విగ్రహాల ధ్వంసంతో పాటు దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. వెంటనే కారకులను అరెస్ట్ చేయాల ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘ నాయకులు పాల్గొని డప్పులు కొడు తూ పాటలు పాడారు.