రేషన్ బియ్యం తరలింపు నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2020-10-20T07:29:23+05:30 IST
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు గుడివాడ డీఎస్పీ సత్యానందం అన్నారు.
గుడివాడ రూరల్ : రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు గుడివాడ డీఎస్పీ సత్యానందం అన్నారు. నంది వాడ మండలం పుట్టగుంట బ్రిడ్జి వద్ద 17వ తేదీన లారీలో అక్రమంగా తరలిస్తున్న 427 బస్తాల బియ్యాన్ని నందివాడ పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఈ కేసులో నిందితులైన లారీ డ్రైవర్ సోమరౌతు చంద్రశేఖర్, లారీ క్లీనర్ సూరపూడి సురేష్, లారీ ఓనర్ ఎ.శేషగిరిరావు, జె.కోటేశ్వరరావు, నిరంజనరావు, జి.నాగేశ్వ రరావు, కె.రజనీ కుమార్ సోమవారం అరెస్టు చేశా మన్నారు. నిందితులను గుడివాడ రూరల్ పోలీస్స్టేషన్లు మీడియాకు చూపించారు.