రేషన్‌ బియ్యం తరలింపు నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2020-10-20T07:29:23+05:30 IST

రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు గుడివాడ డీఎస్పీ సత్యానందం అన్నారు.

రేషన్‌ బియ్యం తరలింపు నిందితుల అరెస్టు

గుడివాడ రూరల్‌ :  రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకుంటున్నట్లు గుడివాడ డీఎస్పీ సత్యానందం అన్నారు.  నంది వాడ మండలం పుట్టగుంట బ్రిడ్జి వద్ద  17వ తేదీన  లారీలో అక్రమంగా తరలిస్తున్న 427 బస్తాల బియ్యాన్ని నందివాడ పోలీసులు స్వాధీనం చేసుకోగా, ఈ కేసులో నిందితులైన లారీ డ్రైవర్‌ సోమరౌతు చంద్రశేఖర్‌, లారీ క్లీనర్‌ సూరపూడి సురేష్‌, లారీ ఓనర్‌ ఎ.శేషగిరిరావు, జె.కోటేశ్వరరావు, నిరంజనరావు, జి.నాగేశ్వ రరావు, కె.రజనీ కుమార్‌ సోమవారం అరెస్టు చేశా మన్నారు.  నిందితులను గుడివాడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లు మీడియాకు చూపించారు. 

 

Updated Date - 2020-10-20T07:29:23+05:30 IST