హత్య కేసు నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2021-01-24T06:42:40+05:30 IST
మండల పరిధిలోని మా రాల గ్రామంలో శుక్రవారం జరిగి దాసరి రేణుకా హత్యకేసుకు సంబంధించి శనివారం ఇద్దరిని అరెస్టు చేసినట్టు పుట్టపర్తిరూరల్ సీఐ నరసింహరావు, ఎస్ఐ నరేంద్రభూపతి తెలిపారు.
బుక్కపట్నం, జనవరి 23: మండల పరిధిలోని మా రాల గ్రామంలో శుక్రవారం జరిగి దాసరి రేణుకా హత్యకేసుకు సంబంధించి శనివారం ఇద్దరిని అరెస్టు చేసినట్టు పుట్టపర్తిరూరల్ సీఐ నరసింహరావు, ఎస్ఐ నరేంద్రభూపతి తెలిపారు. స్థానిక పోలీ్సస్టేషనలో శనివారం నిందితుల అరెస్ట్ వివరాలను విలేకరుల సమావేశంలో వారు వెల్లడించారు. మారాల గ్రామానికి చెందిన దాసరి రేణుకా హత్య కేసు నిందితులు ముదిగుబ్బ మండల పరిధిలోని గరుగుతండా వద్ద ఉన్నారని సమాచారం అందిందన్నారు. దీంతో సిబ్బందితో వెళ్లి వరలక్ష్మీ, నరసింహులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు వారు తెలిపారు. హత్య జరిగిన 24 గంటల్లోగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.