దళితులపై దాడి ఘటనలో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2022-01-22T06:20:52+05:30 IST
దళితులపై దాడి ఘటనలో నిందితుల అరెస్టు
వ్యక్తిగత పూచీకత్తుపై ఆరుగురికి బెయిల్
మైలవరం, జనవరి 21 : జి.కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో దళిత యువకులపై దాడి ఘటనలో సర్పంచ్ పిల్లి రామారావు, ఎంపీటీసీ సభ్యుడు పిల్లి ప్రసాద్, పోతనబోయిన సూర్యనారాయణ, దబ్బాల నాగరాజు, ఉప్పునీళ్ల పుల్లారావు, దాణబోయిన వీరభద్రరావుపై జి.కొండూరు పోలీస్ స్టేషన్లో శుక్రవారం సెక్షన్ 324, ఆర్బీడబ్ల్యూ ఐపీసీ 3, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దళితులు, బాధితుల బంధువులు, మాజీ న్యాయమూర్తి జె.శ్రావణ్కుమార్ గురువారం రాస్తారోకో చేయడంతో అర్థరాత్రి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం ఆరుగురికి కొవిడ్ టెస్టులు నిర్వహించి జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి షేక్ షరీన్ నిందితులు ఒక్కొక్కరికీ రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు.