అరియర్స్‌, పీఆర్‌సీ విడుద ల చేయాలి

ABN , First Publish Date - 2021-04-17T05:03:30+05:30 IST

విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే ఉద్యోగులకు ఇవ్వాల్సిన 30 నెలల కరువు భత్యపు అరియర్స్‌తో పాటు 55 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్‌సీ వెంటనే విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జంబారపు అహరోన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అరియర్స్‌, పీఆర్‌సీ విడుద ల చేయాలి

కడప(మారుతీనగర్‌), ఏప్రిల్‌ 16: విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే ఉద్యోగులకు ఇవ్వాల్సిన 30 నెలల కరువు భత్యపు అరియర్స్‌తో పాటు 55 శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన పీఆర్‌సీ వెంటనే విడుదల చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జంబారపు అహరోన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక ఏడురోడ్లు సమీప గుంతబజార్‌లోని ఆ సంఘం కార్యాలయాంలో పాత్రికేయులతో మాట్లాడారు. ఓ వైపు కరోనా, మరో వైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న దృష్ట్యా వెంటనే చెల్లించాలని కోరారు. సమావేశంలో సంఘ కార్యదర్శి గంగన్న ట్రెజరర్‌ నరేంద్రరెడ్డి, ఉపాధ్యక్షులు బాలచౌడన్న, వరప్రసాద్‌, సుహాసిని పాల్గొన్నారు.

Updated Date - 2021-04-17T05:03:30+05:30 IST