కొప్పర్రు ఘటనలో 25మంది అరెస్టు

ABN , First Publish Date - 2021-09-29T05:12:06+05:30 IST

కొప్పర్రు ఘటనకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన 25 మందిని అరెస్ట్‌ చేసినట్లు బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు తెలిపారు.

కొప్పర్రు ఘటనలో 25మంది అరెస్టు
నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచిన పోలీసు సిబ్బంది

పెదనందిపాడు, సెప్టెంబరు28: కొప్పర్రు ఘటనకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన 25 మందిని అరెస్ట్‌ చేసినట్లు బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 20న వినాయక నిమజ్జన సమయంలో పాతకక్షల నేపథ్యంలో ఇరువర్గాలు ఘర్షణ పడగా 15 మందికి గాయాలయ్యాయని తెలిపారు.  సంఘటనా స్థలంలో తీసిన వీడియోలను పరిశీలించి కేసులు నమోదు చేశామన్నారు. ఇంకెవరైనా ఉన్నట్లు తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తామని తెలిపారు.  సమావేశంలో పొన్నూరు రూరల్‌ సీఐ అలహరి శ్రీనివాసరావు, ఎస్‌ఐ కె.నాగేంద్రరావు, సిబ్బంది ఉన్నారు. 


Updated Date - 2021-09-29T05:12:06+05:30 IST