రోడ్లు మంత్రుల కోసమేనా?
ABN , First Publish Date - 2022-06-29T05:00:21+05:30 IST
రోడ్లు జనం కోసం. ఆ రోడ్ల మీదే మంత్రులు కూడా తిరుగుతారు.
బుగ్గన వస్తున్నారని గుంతలు పూడ్చారు
మరి వెంకటాపురం వెళ్లే రహదారిపై గోతులు కనిపించవా..?
డోన్, జూన్ 28: రోడ్లు జనం కోసం. ఆ రోడ్ల మీదే మంత్రులు కూడా తిరుగుతారు. ఏళ్ల తరబడి డోన్లోని తారక రామ నగర్ రహదారి గుంతలు తేలి అస్తవ్యస్తంగా ఉంటే ఆర్ఆండ్బీ అధికారులు పట్టించుకోలేదు. దానికి ఈ ఫొటోలో ఉన్న రోడ్లే నిదర్శనం. ఆ రోడ్డు మీదే జనం నానా అవస్త పడ్డారు. అయితే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వస్తున్నారని ఆర్ ఆండ్ బీ అధికారులు హడావిడిగా ఈ రహదారికి మరమ్మతు చేశారు. ఆఘమేఘాల మీద గుంతలను పూడ్చేశారు. అదే రహదారిలో వెంకటాపురం వెళ్లే రహదారిలో ప్రమాదకరంగా ఉన్న గోతులను మాత్రం పట్టించుకోలేదు. మరి ఆ మార్గంలో మంత్రి వెళ్లడం లేదు కదా..! కాబట్టి ఆ రోడ్డు ఎలా ఉంటే మాకేం.. అని అధికారులు అనుకున్నట్లు ఉంది.