రెండోరోజూ ఆర్చరీ పోటీలు
ABN , First Publish Date - 2021-09-18T06:49:47+05:30 IST
రెండోరోజూ ఆర్చరీ పోటీలు
భవానీపురం, సెప్టెంబరు 17 : రాష్ట్రస్థాయి 40వ సీనియర్ ఆర్చరీ పోటీలు మహానాడు రోడ్డులోని ఓల్గా ఆర్చరీ అకాడమీ ఫీల్డ్లో రెండోరోజు శుక్రవారం కొనసాగాయి. 13 జిల్లాల పురుషులు, మహిళల రికర్వ్ విభాగాల్లో మొత్తం 100కు పైగా విలువిద్య క్రీడాకారులు త లపడ్డారు. ఓల్గా ఆర్చరీ అకాడమీ చీఫ్ కోచ్, రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జాతీయ పోటీలకు ఎంపికైంది వీరే..
పురుషుల రికర్వ్ విభాగంలో బొమ్మదేవర ధీరజ్, చిట్టిబొమ్మ జిజ్ఞాస్, దేవినేని మైత్రేయ (కృష్ణా), ఎస్.సాంబశివ (విశాఖ), స్టాండ్బైగా గమ్మిలి బిర్గయ్నాయుడు (విశాఖ), మహిళల విభాగంలో ఉక్కా సుమ (నెల్లూరు), కుందేరు చంద్రహాసినీ, ఆకుల రవళి, బెల్లంకొండ వైష్ణవి (కృష్ణా), స్టాండ్బైగా కతారి ప్రియ (నెల్లూరు) ఎంపికయ్యారు.