అరసవల్లికి భక్తుల తాకిడి

ABN , First Publish Date - 2021-01-18T05:10:30+05:30 IST

ఆదిత్యుడి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. పండుగ సమయం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు ఎక్కువ మంది స్వామి దర్శనం చేసుకున్నారు. వేకువజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఉదయానికి క్యూలైన్‌లో బారులుదీరి ఉండడం కనిపించింది

అరసవల్లికి భక్తుల తాకిడి
క్యూలైన్‌లో భక్తులు




గుజరాతీపేట, జనవరి 17: ఆదిత్యుడి దర్శనానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. పండుగ సమయం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారు ఎక్కువ మంది స్వామి దర్శనం చేసుకున్నారు. వేకువజాము నుంచే భక్తుల తాకిడి అధికంగా ఉంది. ఉదయానికి క్యూలైన్‌లో బారులుదీరి ఉండడం కనిపించింది. ప్రత్యేక దర్శనం క్యూలైన్ల వద్ద టెంట్లను ఏర్పాటుచేశారు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా నుంచి సైతం భక్తులు తరలివచ్చారు.  ఆదివారం రూ.3,53,890ల ఆదాయం లభించినట్టు ఈవో హరిసూర్యప్రకాశ్‌ తెలిపారు. టిక్కెట్ల రూపంలో రూ.1,25,500లు, విరాళాల రూపంలో రూ.63,390లు, ప్రసాదాల  విక్రయాల ద్వారా రూ.1,65,000లు సమకూరినట్టు చెప్పారు.  



Updated Date - 2021-01-18T05:10:30+05:30 IST