వల్లూరుకు కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం

ABN , First Publish Date - 2021-02-27T05:53:52+05:30 IST

అభ్యుదయ రచయితల సంఘం(అరసం) ఆధ్వర్యంలో విద్యానగర్‌లో శుక్రవారం అభ్యుదయ సాహితీ వేత్త వల్లూరు శివప్రసాద్‌కు కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారంతో సత్కరించారు.

వల్లూరుకు కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం
వల్లూరు శివప్రసాద్‌ను సత్కరిస్తున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌

గుంటూరు(సాంస్కృతికం), ఫిబ్రవరి 26: అభ్యుదయ రచయితల సంఘం(అరసం) ఆధ్వర్యంలో విద్యానగర్‌లో  శుక్రవారం అభ్యుదయ సాహితీ వేత్త వల్లూరు శివప్రసాద్‌కు కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కారంతో సత్కరించారు. శివప్రసాద్‌ రచించిన ఏడు గుడిశెలపల్లె నాటికకు ఈ పురస్కారం లభించింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్‌ పాపినేని శివశంకర్‌, డాక్టర్‌ నూతక్కి సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.    

Updated Date - 2021-02-27T05:53:52+05:30 IST