శ్రీవారి సేవలో ఆంధ్రా భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌

ABN , First Publish Date - 2022-05-16T05:48:29+05:30 IST

శ్రీవారి సేవలో ఆంధ్రా భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌

శ్రీవారి సేవలో ఆంధ్రా భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌
ప్రత్యేక పూజలు చేస్తున్న అరజా శ్రీకాంత్‌

ద్వారకాతిరుమల, మే 15:చినతిరుమలేశుని ఆలయాన్ని న్యూఢిల్లీ లోని ఆంధ్రా భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ డాక్టర్‌ అరజా శ్రీకాంత్‌ ఆదివారం సందర్శించారు. కుటు ంబ సమేతంగా ఆల యానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించాక, ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖమండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనాన్ని పలికారు. ఆలయ అధికారులు ఆయనకు స్వామి మెమొంటోను, ప్రసాదాలను అందజేశారు.

Updated Date - 2022-05-16T05:48:29+05:30 IST