ఏపీసీపీఎస్ఈఏ జిల్లా నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2022-06-26T06:36:21+05:30 IST
ఏపీసీపీఎస్ఈఏ ఉమ్మడి విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశం మధురానగర్లో గల జీవీఎంసీ పాఠశాలలో శనివారం నిర్వహించారు.
సీతంపేట, జూన్ 25: ఏపీసీపీఎస్ఈఏ ఉమ్మడి విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశం మధురానగర్లో గల జీవీఎంసీ పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రొంగలి అప్పలరాజు ముఖ్య అతిఽథిగా విచ్చేసి మాట్లాడుతూ సీపీఎస్ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో విభజిత విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా బి.దేముడు బాబు, గౌరవ సలహాదారుడిగా ఎస్.కరుణాకర్, అధ్యక్షుడిగా జి.శ్రీను, ప్రధాన కార్యదర్శిగా జి.ప్రసన్న కుమార్, అడిషనల్ జనరల్ సెక్రటరీగా సీహెచ్ మోహన్, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఐ.శ్రీనివాస్ కుమార్, కోశాఽధికారిగా ఆర్.రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లుగా ఎం.రాజాబాబు, ఎ.రవి, గౌస్బాబు, జాయింట్ సెక్రటరీలుగా ఆర్.శేఖర్, బి.గణపతి, బీఎల్ఎన్ స్వామి, పి.మోహన్, ప్రతాప్ సింగ్, మీడియా ఇన్చార్జిగా బి.లక్ష్మణ్రెడ్డి, మహిళా సెక్రటరీగా ఎం.రమదేవిలను నియమించారు.